గవర్నర్‌కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు

SMTV Desk 2017-08-07 15:45:51  NARASIMHAN, RAAJBHAVAN, STUDENTS, WOMENS

హైదరాబాద్, ఆగస్ట్ 7 : రాజ్‌భవన్‌లో రక్షాబంధన్‌ వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకల్లో గవర్నర్‌ దంపతులతో పాటు నగరవాసులు పాల్గొన్నారు. గవర్నర్‌కు పలువురు విద్యార్థులు, మహిళలు, పలు రంగాలకు చెందిన మహిళా అధికారులు, అంతేకాకుండా బ్రహ్మకుమారీలు సైతం ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ కూడా వారిని ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలదరికి రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగు రాష్ట్రాల్లోని అడపడుచులతో పాటు దేశంలోని మహిళలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సమాజంలో ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.