తెలంగాణలో 23,000 పల్స్ పోలియో కేంద్రాల ఏర్పాట్లు

SMTV Desk 2019-03-11 07:24:56  pulse polio drops telangana, pulse polio drops, etele rajender, rangareddy

రంగారెడ్డి, మార్చ్ 10: తెలంగాణ రాష్ట్రంలో నేడు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని గండిపేట మండలం నార్సింగ్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వమని.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు 23,000 పల్స్ పోలియో కేంద్రాల ఏర్పాట్లు చేశామని తెలిపారు.