హైదరాబాద్, మార్చ్ 09: తెలంగాణాలో పార్లమెంటు ఎన్నికలు దగ్గరవడంతో అధికార తెరాస పార్టీ కి సంబందించిన నాయకులతో కలిసి తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని నియోజక వర్గాల్లో తిరుగుతూ తమ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు… మెదక్ స్తానం కంటే కూడా కరీంనగర్ లోనే ఎక్కువగా మెజారిటీ సాధిస్తామని, అది కూడా ప్రజలు తమకు ఇచ్చే బహుమతి అని కేటీఆర్ అన్నారు. ఈ సంఘటన మీద మెదక్ పార్లమెంటు కి సంబందించిన ప్రతినిధులందరికి కూడా కేటీఆర్ సవాల్ విసిరారు.
అంతేకాకుండా హరీష్రావు గారు చెప్పినట్లు ఈ రోజు పోటీ కాంగ్రెస్, బీజేపీకి, మనకు లేదు. కేవలం ఒకరితో ఒకరికి ఉన్న మెజారిటీ తేడాతోనే గెలుపు ఉంటుందన్నారు. కరీంనగర్, వరంగల్ పార్లమెంటు నియోజక వర్గాల్లో అధిక మెజారిటీ సాధించే దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సిరిసిల్ల నియోజకవర్గం నాది. నేను కూడా సవాల్ చేస్తున్నా. మా కంటే ఎక్కువ మెజార్టీ తీసుకువచ్చి రుజువు చేసుకోవాలని కేటీఆర్ సవాల్ విసిరారు.