హైదరాబాద్, మార్చి 8: ఆంధ్రప్రదేశ్ ఐటీ గ్రిడ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలకు దారితీస్తుంది. మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై స్పందిస్తూ, తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రవాదులతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత దినేష్ చౌదరి శుక్రవారం నాడు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చంద్రబాబు తన వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీసే విధంగ చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని దినేష్ ఆరోపించారు.
2014 ఎన్నికల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దినేష్ చౌదరి టీఎన్ఎస్ఎఫ్ నాయకుడిగా పని చేశారు. టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష పదవి దినేష్ చౌదరికి దక్కలేదు. ఆయన స్థానంలో ఈడిగ ఆంజనేయులు గౌడ్కు ఈ పదవిని బాబు ఇచ్చారు. దీంతో ఆయన కొంత కాలానికే టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. కాగా ఆంజేయులు గౌడ్ కూడా గతంలోనే టీఆర్ఎస్లోనే చేరారు.