కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన రేగా

SMTV Desk 2019-03-05 12:18:01  congress, rega..

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేగా కాంతరావు.. కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

‘పీసీసీ, సీఎల్పీ నేత నన్ను ఎంతకు అమ్ముడు పోయారని ఆరోపణలు చేస్తున్నారు. నేను అమ్ముడు పోయే రకం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే.. రూ. 50లక్షలు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. అయినా నేను సీఎం కేసీఆర్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాను. గులాబీ కండువా కప్పుకుంటే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివాసుల ఆత్మ గౌరవం దెబ్బతినేలా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ లో 16 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. నాలుగు గ్రూపులు ఉన్నాయి.’ అని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.