ఐఫోన్ లో అసలు కథ...లాక్ ఓపెన్ అయ్యేది ఎప్పుడో...?

SMTV Desk 2019-02-09 08:26:21  Jhansi suicide case, Hyderabad, police, Suryateja

హైదరాబాద్, ఫిబ్రవరి 09: తెలుగు టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసుపై విచారణ ఇంకా కొనసాగుతుంది. ఇటీవల ఆమె తన స్వగృహంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఝాన్సీ పలుమార్లు ప్రియుడు సూర్యతేజతో ఫోన్లో మాట్లాడినట్లు పోలిసుల విచారణలో తేలింది. ఉదయం ఆరు గంటలకు, పది గంటలకు అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు ప్రియుడితో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆమె ఫోన్ నుండి పోలీసులు సేకరించారు. దీంతో వారిద్దరి మద్య సంబంధం ఆమె చనిపోయే ముందు వరకు కొనసాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆమె రెండు ఫోన్లు వాడుతుండగా దాంట్లో శాంసంగ్ ఫోన్ లాక్ మాత్రమే పోలీసులు ఓపెన్ చేయగలిగారు. ఇంకో ఐఫోన్ లాక్ ఓపెన్ చేయడానికి ఇంకా ప్రయత్నిస్తున్నారు. లాక్ ఓపెన్ చేసిన ఫోనులో ఆమె ఆత్మహత్యకు ముందు తీసుకునా వీడియో ఏది లేదని తెలుస్తుంది. రెండో ఫోన్ కూడా లాక్ ఓపెన్ చేస్తే ఏమైనా సమాచారం దొరకవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఝాన్సీ కుటుంబసభ్యులు అంత్యక్రియల కోసం తమ స్వగ్రామానికి వెళ్ళగా విచారణ కోసం వారిని నగరానికి రావాలని పోలీసులు ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ కేసులో సుర్యతేజను కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారని సమాచారం.