ఊహించని మలుపు తిరిగిన జయరాం హత్యా కేసు

SMTV Desk 2019-02-06 10:22:58  Jayaram, Shikha Choudary, Rakesh Reddy, Rakesh Reddy Dairy

హైదరాబాద్, ఫిబ్రవరి 06: ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి హత్యా కేసులో తాజాగా మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అత్యంత కీలక ఆధారంగా భావిస్తున్న రాకేశ్ రెడ్డి డైరీ ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఆ డైరీ లోని రాతలను చుసిన పోలీసులు అది రాకేశ్ రాసినదని గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే ఈ దిరు=వై కో రాకేశ్ పలు కీలక విషయాలను రాసుకున్నాడు. జయరామ్ కు తాను అప్పుగా ఇచ్చిన మొత్తం డబ్బునూ ఎలాగైనా వసూలు చేయాలని, తనను మోసం చేస్తున్న శిఖా చౌదరిపై పగ తీర్చుకుని తీరుతానని కూడా రాకేశ్ రాసుకున్నాడు. ఇప్పుడు ఈ డైరీ ని విశ్లేషిస్తున్న పోలీసులు, కేసును ఇంకా విచారించాల్సి వుందని, కోర్టు అనుమతితో అతన్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తామని అంటున్నారు.