మొన్న అలా... నేడు ఇలా...

SMTV Desk 2019-02-06 09:59:31  Jayaram, Padmasree, Shikha Choudary, Rakesh Reddy

హైదరాబాద్, ఫిబ్రవరి 06: గత కొన్ని రోజులుగా చిగురుపాటి జయరాం హత్యా కేసు సంచలనం రేపుతుంది. ఈ హత్యా కేసులో ఆయన భార్య అయిన పద్మశ్రీ మీడియా ముందు రెండు రకాలుగా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జయరాం హత్యా గురించి తెలుసుకున్న ఆమె విదేశాల నుండి వచ్చింది. పద్మశ్రీ మొన్న మీడియా ముందు మాట్లాడుతూ తన భర్త మరణంపై ఎవరిపైన అనుమానాలు లేవని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పద్మశ్రీ ఈ విషయాన్ని మీడియా ముందు చెప్పే సమయానికే జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి, రాకేశ్ రెడ్డిలు నందిగామ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసును పోలీసులు విచారించి, నిందితులను బయటకు తిస్కోస్తారన్న నమ్మకం తనకుందని కూడా రెండు రోజుల క్రితం పద్మశ్రీ వ్యాఖ్యానించారు.

కానీ 24 గంటలు గడవక ముందే ఆమె తీరు మారింది. ఎప్పుడైతే ఈ కేసులో శిఖా ప్రమేయం లేదని ఏపీ పోలీసులు వెల్లడించారో, ఆ వెంటనే ఆమె జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన భర్త హత్యా హైదరాబాద్ జరిగిందని తెలుపుతూ, ఏపీ పోలీసులు కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త సొంత సోదరి నుంచే ప్రాణహాని ఉందని తనకు చెప్పేవారని, ఈ కేసులో అసలు నిందితులను ఏపీ పోలీసులు తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసు వెనుక తనకు శిఖా చౌదరిపై అనుమానం ఉందని వెల్లడించారు. దీంతో ఆమె ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి.