ఇప్పుడేమి చెయ్యలేం: జూబ్లీహిల్స్ పోలీసులు

SMTV Desk 2019-02-06 08:01:57  Jayaram, Padmasree, CI Harish Chandra

హైదరాబాద్, ఫిబ్రవరి 06: ఎక్స్ ప్రెస్ టివి ఎండి, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం ఐదు రోజుల క్రితం హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే, ఈ హత్యకి సంబందించిన కేసులో తాము ఏమి చెయ్యలేమని జూబ్లీహిల్స్ సీఐ హరీశ్ చంద్ర వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కేసును ఆంద్ర ప్రదేశ్ పోలీసులు విచారిస్తున్నారు. కాగా, వారి విచారణ ముగిసిన తరువాత లేదా కేసు తమ పరిధిలోకి వచ్చిన తరువాత మాత్రమే రంగంలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా నుండి వచ్చిన జయరాం భార్య పద్మశ్రీ నిన్న జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త హత్య వెనుక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాలని కోరింది. ఏపీ పోలీసులు అసలు నిందితులను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తనకు అనుమానంగా ఉందని కూడా ఆమె ఆరోపించారు. దీంతో ఈ కేసులో న్యాయ నిపుణుల సలహాను తీసుకుని ముందడుగు వేయాలని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు.