కోటలో గజ దొంగలు....!

SMTV Desk 2019-02-05 18:02:10  Golkonda fort, robbery, Hyderabad

హైదరాబాద్, ఫిబ్రవరి 05: హైదరాబాద్ పురాతన కట్టడాలలో ఒకటైన గోల్కొండ కోటలో ఆదివారం దొంగలు పడ్డారు. కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయం హుండీని పగులగొట్టి అందులో భక్తులు వేసిన కానుకలను అపహరించేందుకు యత్నించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రోజు అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులు, పూజారి ఆలయంలో హుండీ పగిలిపోయి ఉండడం చూసి పోలీసులకు పిర్యాదు చేసారు. పూజారి సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిసరాలను పరిశీలించారు. పూజారి, ఈవో మహేందర్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

దోపిడీ దొంగలు తెలివిగా ఆలయంలోకి ప్రవేశించడానికి ముందే సిసి కెమరాలను ద్వంసం చేసారు. ఈ చోరీకి ప్రయత్నించిన దుండగులను గుర్తించేందుకు గోల్కొండ కోట ప్రవేశద్వారం వద్ద వున్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దుండగుల కోసం ప్రత్యేక గాలింపు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.