దాసరి మరణంపై అనుమానాలు

SMTV Desk 2017-06-01 12:23:18  dhasari narayana rao, sushila, prabhu, social media, hospital, dhasari family

హైదరాబాద్, జూన్ 1 : దాసరి మరణం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆయన పెద్ద కోడలైన సుశీల ఆరోపించారు. గతంలో మామగారిని ఆసుపత్రిలో ఉన్నప్పుడు తాను వెళ్ళితే అనుమతించలేదని స్పష్టం చేశారు. దాసరి ఇకలేరన్న వార్త వినగానే అనుమానంతో ఈ వ్యాఖ్యలు చేశారు. "మా కుటుంబంలో కొన్ని కలహాల వల్ల నేను, నా భర్త ప్రభు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కానీ విడాకులు మాత్రం అవలేదు. అంతకు మునుపు మామగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడే చాలా మంది అనుమానాలు వ్యక్త పరిచారు. అంత ఆరోగ్యంగా ఉన్న దాసరి గారు ఇలా అనారోగ్యానికి గురికావడంపై ఆరోపించారు. అంతకు ముందు కూడా వచ్చినప్పుడు లోనికి పోనివ్వకపోవడంపై కొంచెం అనుమానాలు తెలిపారు. అంతెందుకు మొన్న మే 4న మామగారి దగరకు వెళ్ళాను. ఆయన నాతో మాట్లాడుతూ ఇంకో రెండువారాలోపు చిన్న సర్జరీ ఉంది, అది కాగానే, నా కొడుకును సినీ రంగానికి పరిచయం చేస్తానని, ఎంతో మందికి జీతలిచ్చిన నేను .... మీకు అన్యాయం చేయాను అంటూ నా మనవడి భాగోగులు కూడా నేనే చూసుకుంటానని రెండు వారాల తరువాత మిగితా విషయాలు మాట్లాడుకుందాం అంటూ నాతో చెప్పారు. అంతలో ఎలాంటి ఘటన చోటుచేసుకుంది. అని వెల్లడించిన సుశీల చేసిన ఇలాంటి వ్యాఖ్యలకు చాలామంది నెటిజన్లు సుశీలకు తిడుతూ ... కుటుంబంలో ఎన్ని వివాదాలు చోటుచేసుకున్నప్పడికి సొంత ఇంటి మనిషి పోయినప్పుడు ఇలాంటి వ్యాఖ్య చేయడం ముమ్మాటికి సరికాదంటున్నారు. మొత్తం మీద ఆస్తి కోసమే ఆమె ఇలాంటి అనుమానపు వ్యాఖ్యలు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.