శ్రీశైలం ఆలయంలో క్రిస్మస్ వేడుకలు...!!!

SMTV Desk 2019-01-12 16:08:45  Srisailam temple, Christamus celebrations

కర్నూల్, జనవరి 12: ప్రముఖ శ్రీశైలం దేవస్థానంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించాడు ఓ అధికారి. ఈ సంఘటన తెలుసుకున్న దేవాదాయ శాఖ ఆ అధికారిని విధుల నుండి తప్పించింది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని గత నెల 25న శ్రీశైలం దేవస్థానానికి సమీపంలోని గంగాసదన్‌లో మోహన్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించినట్లుగా ఆరోపణలు వచ్చాయి.

దీంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీనిపై స్పందించిన దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణలో మోహన్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించినట్లు తేలడంతో శ్రీశైలం దేవస్థానం ఈవో రామచంద్రమూర్తి... మోహన్‌ను విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.