ఉత్తమ్ కుమార్ పై సంచలన ఆరోపణలు చేసిన సర్వే

SMTV Desk 2019-01-10 16:37:55  sarvey sathyanarayana, utham Kumar reddy,

న్యూ ఢిల్లీ, జనవరి 10: తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమర్ రెడ్డి పై మాజీ ఎంపి సర్వే సత్యనారాయణ ఘాటుగా విమర్శించారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి కుంతియాపై చేసిన వ్యాఖ్యలకు ఆంటోని తనని వివరణ కోరారని మాజీ ఎంపి సర్వే సత్యనారాయణ తెలిపారు. ఎఐసిసి క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎకె ఆంటోనీని సర్వే సత్యనారాయణ కలిశారు. ఈ సందర్భంగా సర్వే మీడియా అధికారులతో మాట్లాడారు. తనని సస్పెండ్ చేయడం ఏంటని ఆంటోనే ఆశ్చర్యపోయారన్నారు. ఉత్తమ్, కుంతియా తప్పిదాలను ఆంటోనీకి వివరించామని, ఎఐసిసి సభ్యుడిగా ఉన్న తనపై క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం ఉత్తమ్‌కు లేదని దుయ్యబట్టారు . టికెట్ల కేటాయింపులో డబ్బులు దండుకుని పక్షపాతంగా ఉత్తమ్ వ్యవహరించారని సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తమ్ చర్యల వల్ల ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, కోదండరామ్ అభాసుపాలయ్యారని స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం లాంటి స్థానాల్లో సమర్థులకు టికెట్ కేటాయించకుండా పార్టీకి నష్టం చేశారని మండిపడ్డారు . కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసిన ఉత్తమ్‌పైనే చర్యలు తీసుకోవాలని సర్వే డిమాండ్ చేశారు. తన ఆరోపణలన్నీ రాతపూర్వకంగా ఇవ్వాలని ఆంటోని తనకు చెప్పారన్నారు.