హైదరాబాద్, జనవరి 7: ఏపీ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని తెరాస నేత, మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడాడు తలసాని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 నెలలలో దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ కీలకపాత్ర పోషిస్తుందని తలసాని అన్నారు.
కొత్త ఏర్పడ ఏపీలో పరిపాలన సక్రమంగా లేదని ఎద్దేవా చేశారు. అధికారపక్షం పనులు చేయకుండా.. ప్రతిపక్షం తరహాలో దీక్షలు చేస్తోందని తలసాని మండిపడ్డారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలను పక్కనబెట్టి చంద్రబాబు కాంగ్రెస్ వెంట నడుస్తున్నారని ఆరోపించారు. బాబు పనులు చేయకుండా పబ్లిసిటీతో గడిపేస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.