వరంగల్, జనవరి 3: సంగెం మండలంలోని తీగారాజుపెల్లి గ్రామానికి చెందిన కుమార్ అనే ఓ టీవీ చానెల్ రిపోర్టర్ తన బంధువుల అంత్యక్రియలకు వెళ్లి అధికంగా మద్యం సేవించి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాసాగాడు. వివరాల ప్రకారం కొత్తూరులో తన బంధువు అంత్యక్రియలకు వచ్చాడు. అతిగా మద్యం సేవించాడు. ఓ వైపు అంతిమయాత్ర జరుగుతుండగానే, తాగిన మైకంలో ఉన్న అతడు ఓ ఇంటి వద్ద మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీయబోయాడు.
అది గమనించిన స్థానికులు, మహిళలు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో తాను ఓ టీవీ చానెల్ రిపోర్టర్గా పని చేస్తున్నానని చెప్పినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఇదే యువకుడు ఇటీవల సంగెం మండలంలో మద్యం షాపులో కూడా గొడవపడగా, పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.