హైదరాబాద్, డిసెంబర్ 26: లక్టీకాపూల్ సమీపంలోని గ్లోబల్ ఆస్పత్రిలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోవడంతో బందువులు ఆస్పత్రిలో వీరంగం సృష్టంచిన విషయం తెలిసిందే. అయితే గ్లోబల్ ఆస్పత్రి వైద్యులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వైద్యులు ఆందోళనకు దిగారు.
లక్డికాపూల్లోని రోడ్డు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సేవ్ డాక్టర్స్ పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు. వైద్యులపై దాడితో పోలీసు వ్యవస్థపై నమ్మకం పోతోందని వ్యాఖ్యానించారు. రోగుల బంధువులు వైద్యులపై దాడులకు పాల్పడితే సేవలందించలేమని, ఆ ప్రభావం ఇతర రోగులపై పడుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని వైద్యులకు రక్షణ కల్పించాలని, ఆస్పత్రిలో వీరంగం సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Global Hospital, Hyderabad. Patient brought in a critical condition. Relatives who dont trust doctors and think they know better, refuse intubation. Patient dies. This happened after that. pic.twitter.com/ip4YNqcAHE
— Dr Sulbha Arora (@SulbhaArora) December 25, 2018