జనగామ, డిసెంబర్ 20: తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో తెరాస అబ్యర్దులు అందరు మంచి మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యకర్తల సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్య మంచి మెజార్టీతో విజయం సాధించారని అన్నారు. అలాగే పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావును యాభై మూడు వేల ఓట్ల మెజార్టీతో ప్రజలు గెలిపించిన విషయాన్ని గుర్తు చేశారు. దయాకర్ రావుకి ఇన్నిరోజులు సరైన పార్టీలో లేరని, ఇప్పుడు సరైన పార్టీలో ఉన్నారు కనుకే యాభై మూడు వేల మెజార్టీ వచ్చిందని చెప్పానని అన్నారు.
దయాకర్ రావు ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలవగా, ఈ ఆరు సార్లలో ఇప్పుడే ఆయనకు ఎక్కువ మెజార్టీ వచ్చిందని చెప్పారు. ‘రైట్ మ్యాన్ ఇన్ రైట్ పార్టీ అన్నట్టుగా ఆయన సరైన నిర్ణయం తీసుకుని టీఆర్ఎస్ లో చేరారు. అందుకే, ఆయనకు మద్దతుగా ప్రజలు కూడా కరెక్టు నిర్ణయం తీసుకున్నారని దయాకర్ రావుకి చెప్పిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.