హైదరాబాద్, డిసెంబర్ 19: పరకాల పట్టణ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రధాన అనుచరుడైన వజ్ర రవికుమార్ (46) ఈరోజు ఉదయం ఆకస్మికంగా మృతిచెందారు. రవికుమార్ అనారోగ్యంతో భాదపడుతూ రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈరోజు తెల్లవారుజామున హఠాత్తుగా గుండె పోటు రావడంతో ఆస్పత్రిలోనే మృతిచెందారు. రవికుమార్ ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు.
కాగా, రెండు రోజుల క్రితం ఆయన అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ఉండగానే రవికుమార్ గుండెపోటుకు గురయ్యాడు, అతన్ని బ్రతికించడానికి డాక్టర్లు ఎంత ప్రయత్నించిన ఫలించలేదు.దీంతో పరకాల టీఆర్ఎస్ పార్టీలో విషాదం నెలకొంది, నాయకులు, కార్యకర్తలతో పాటు పట్టణ ప్రజలు కూడా రవికుమార్ మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.