హైదరాబాద్, జూలై 26 : డ్రగ్స్ కేసులో మరో కీలక వ్యక్తిని అరెస్టు చేసారు. నెదర్లాండ్ కు చెందిన మిక్ కమింగ్ (33) ను అరెస్టు చేసారు. ఇతను 3 సార్లు భారత్ కు వచ్చినట్లు అకుల్ సబర్వాల్ తెలిపారు. ఇతని కోసం వారం రోజులుగా పోలీసులు గాలింపు చేపట్టగా మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ హైదరాబాద్ కు రావడానికి ఇతను కారణమని, ఈ కేసులో కీలకమైన వ్యక్తీ అని సబర్వాల్ తెలియజేశారు. అతని దగ్గర నుంచి మరింత కీలక సమాచారం రాబట్టనున్నారని సమాచారం.