హైదరాబాద్, డిసెంబర్ 15: హైదరాబాద్ లో పెద్దఅంబర్పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు రెండు బైక్లను ఢీకొట్టడంతో వొక ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. మరో ముగ్గురుకి తీవ్రంగా గాయాలయ్యాయి. టైర్ పేలడంతో డివైడర్ను ఢీకొట్టి అవతలి రోడ్డులోకి దూసుకుచ్చిన కారు అటుగా వస్తున్న రెండు బైక్లను ఢీకొట్టింది. వొక బైక్పై బ్రిలెంట్ కాలేజ్కు చెందిన పృద్ధన్, ఉమర్, మరో బైక్పై అవంతి కాలేజ్కు చెందిన వినంత్, మనిష్ ఉన్నారు. వీరిలో వినంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.