హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణాలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోహత్యలు చేసే వారిని బతకనివ్వనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి తన గెలుపును అడ్డుకునేందుకు కొంతమంది చివరి వరకు ప్రయత్నించారన్నారు. రానున్న ఐదు సంవత్సరాలలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకే అంకితమవుతానన్నారు. ఆయన ఈరోజు గోషామహల్ నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు