హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణలో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ముమ్మరంగా జరుగుతోంది. మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తోంిది. ఇదిలా ఉంటే ప్రజకూటమి కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ముఖ్య నేతలు కొందరు ఓడిపోతారని అనేక కథనాలు వెలుబడ్డాయి. కానీ ప్రస్తుతం ఓట్ల లెక్కింపును పరిశీలిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలలో కొందరు ముందంజలో ఉన్నారు. అయితే ముఖ్యనేతల్లో కొందరు వెనకబడిపోతున్నారు.
వెనుకంజలో ఉన్న కాంగ్రెస్ నేతలు…
రేవంత్ రెడ్డి – కొడంగల్
డీకే అరుణ – గద్వాల్
జానా రెడ్డి – నాగార్జున సాగర్
పొన్నాల లక్ష్మయ్య – జనగామ
ముందంజలో ఉన్న కాంగ్రెస్ నాయకులు
సబితా ఇంద్ర రెడ్డి – మహేశ్వరం
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – మనుగోడు