విడుదల అయిన వెంటనే కేసీఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్ !

SMTV Desk 2018-12-04 18:32:56  revath reddy, kcr

కొడంగల్, డిసెంబర్ 4: కొడంగల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అరాచకాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. 2009 లో ఆయన గెలవటానికి కొడంగల్ ప్రజల పాత్ర చాల ఉంది అన్నారు. పాలమూరు ఎంపీ గా చేసిన ఆయన పాలమూరికి ఏంచేసారో చెప్పాలని అన్నారు.

అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే కేసీఆర్, ఆయన పరిపాలనా కాలంలో ఏం అభివృద్ధి చేసారో తెలపాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో తెరాస ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలని కోరారు.