ఇవే నా చివరి ఎన్నికలు :అక్బరుద్దీన్ ఓవైసీ

SMTV Desk 2018-12-03 16:19:07  Akbaruddin

హైదరాబాద్,డిసెంబర్ 3: ఎంఐఎం అదినేత - చాంద్రాయణగుట్ట అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు కావచ్చని అన్నారు. తన ఆరోగ్యం అస్సలు బాగా లేదని చెప్పారు. ఇకమీదట ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉండకపోవచ్చన్నారు. 'కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాను. నా కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి. కిడ్నీల దగ్గర కొన్ని తూటాల ముక్కలు అలాగే ఉన్నాయి. కొన్ని రోజుల కిందట పరిస్థితి చేయి దాటి పోయింది అని డాక్టర్ చెప్పారు. డాక్టర్ నన్ను డయాలసిస్ చేయించుకోమన్నారు' అని అక్బరుద్దీన్ చెప్పారు. నా ఆరోగ్యాన్ని చూసుకునే సమయం దొరకడం లేదు. స్కూళ్లు, దారుసలాం బ్యాంకులు, హాస్పిటల్స్ చూసుకోవడానికే సరిపోతుంది అని ఆయన తెలిపారు.

తనెప్పుడు తన సొంత ప్రయోజనాలకోసం ఎన్నికల్లో పోటీ చేయలేదని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. తన కమ్యూనిటీకి సేవ చేయడానికే ఎన్నికల బరిలో నిలుస్తానని తెలిపారు. తన కమ్యూనిటీకి తనకుమించి మెరుగ్గా సేవలు చేయడానికి ఎవరు అయితే సిద్ధంగా వుంటారో వాళ్ల కోసం తన స్థానం ఖాళీ చేస్తానని అక్బర్ స్పష్టం చేశారు.