ప్రభుత్వ ఉద్యోగులకు కెసిఆర్‌ శుభవార్త

SMTV Desk 2018-11-27 16:18:34  KCR, govt employees,

మహబూబ్‌నగర్‌ , నవంబర్ 27: మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కెసిఆర్‌ ప్రభుత్వ ఉద్యోగులకు హామీలు గుప్పించారు. టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయమైన ఐఆర్‌ ఇస్తామని, పదవి విరమణ వయస్సు పెంచుతామని స్పష్టం చేశారు. తప్పులు ఉంటే మనలో మనం సరిదిద్దుకుందాం..సర్దుకుందాంగ అని అన్నారు.మహబూబ్ నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు టార్గెట్‌గా పంచ్‌లు పేల్చారు.