హైదరాబాద్, నవంబర్ 27: తెలంగాణ సిఎం కేసీఆర్ రోజుకు 4-5 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారసభలు నిర్వహిస్తుండటంతో తెరాస శ్రేణులు సమరోత్సాహంతో ఉరకలు వేస్తున్నాయి. మంగళవారం సిఎం కేసీఆర్ ఏకంగా ఏడు సభలలో పాల్గొనబోతున్నారు. ఈరోజు ఆయన ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఈవిధంగా ఉంటుంది.
ఉదయం 11 గంటలకు: కల్వకుర్తి, 11.45గంటలకు మహబూబ్నగర్, మధ్యాహ్నం 12.30కు వనపర్తి, 1.15కు కొల్లాపూర్, 2.45కు హాలియా(నాగార్జున్ సాగర్), 3.30కు మునుగోడు, సాయంత్రం 4.30కు ఆలేరులో ప్రజాశీర్వాద సభలలో ప్రసంగిస్తారు.
విశేషమేమిటంటే, ఇవాళ్ళ మధ్యాహ్నం వొంటిగంటకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా మహబూబ్నగర్లో బహిరంగసభలో పాల్గొనడానికి వస్తున్నారు. అంటే సిఎం కేసీఆర్ సభ ముగించుకొని వెళ్ళగానే మోడీ వస్తారన్న మాట. కనుక మహబూబ్నగర్లో నేడు టేశ్, బిజెపి రెండు పార్టీల హడావుడి చాలా జోరుగా ఉంటుందన్న మాట!