ఆర్టీసీకి తీపి కబురు చెప్పిన ఉత్తమ్

SMTV Desk 2018-11-26 17:22:57  RTC, utham Kumar, Congress

హైదరాబాద్, నవంబర్ 26: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ లీడర్ ఉత్తమ్‌కుమార్‌ అన్నారు. ఆసంస్థ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణిస్తామన్నారు. నగరంలో జరిగిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఆర్టీసీ ప్రభుత్వ పరమవుతుందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వమే చూసుకోవాలని.. దాని భారాన్ని ప్రభుత్వమే మోయాలన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా లాభనష్టాలకు అతీతంగా ప్రజా రవాణా వ్యవస్థను చూడాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు.