కేసీఆర్ ఓ మూటల మనిషి : జైపాల్ రెడ్డి

SMTV Desk 2018-11-26 17:19:49  KCr , Jaipal reddy, congress, Mahakutami, TRS

హైదరాబాద్, నవంబర్ 26: తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ రోజు తనను కలుసుకున్నారని జైపాల్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ‘ఆరోజు కేసీఆర్ నా ఇంటికి వచ్చి అన్నా.. నువ్వు అందరికంటే పెద్దవాడివి. సీనియర్ నాయకుడివి. కాబట్టి నువ్వే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా ఉండాలి అని కోరాడు. కానీ కేసీఆర్ ఎలాంటి జిత్తుల మారి వ్యక్తో నాకు తెలుసు కాబట్టే.. ఆనాడు ఆయన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాను అని జైపాల్ రెడ్డి తెలిపారు.

జడ్చర్లలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో మహాకూటమి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇచ్చిన మాటపై నిలబడే అలవాటు కేసీఆర్ కు లేదని జైపాల్ రెడ్డి విమర్శించారు. ఆయన మాటల మనిషి కాదనీ, మూటల మనిషి మాత్రమేనని ఎద్దేవా చేశారు.