కాంగ్రెస్‌ లేకుండా తెలంగాణ ఏర్పడలేదు

SMTV Desk 2018-11-26 14:25:30  Congress, Jairam ramesh

హైదరాబాద్, నవంబర్ 26: రానున్న ఎన్నికలలో భువనగిరిలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని ఈ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతు కాంగ్రెస్‌ లేకుండా తెలంగాణ ఏర్పడలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చింది కేసీఆర్‌ కుటుంబం కోసం కాదన్నారు. విభజన హామీలు సాధించుకోవడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని విమర్శించారు. తెలంగాణను కేసీఆర్‌ దివాలా తెలంగాణగా మార్చారని జైరాం రమేష్‌ అన్నారు