తెరాస కు షాక్ ఇవ్వనున్న మరో ఇద్దరు నేతలు

SMTV Desk 2018-11-25 18:43:34  Trs, vishweswar reddy, keshav rao, jithender

హైదరాబాద్, నవంబర్ 25: తెలంగాణలో రాజకీయం ఉత్కంఠ భరితంగా సాగుతోంది. టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నారని... కేశవరావు, జితేందర్ రెడ్డిలాంటి సీనియర్ నేతలు కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్ అనేది వొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని వారంతా మాట్లాడుకుంటూ ఉంటారని అన్నారు. వొకప్పుడు జై తెలంగాణ అన్న నేతలంతా... ఇప్పుడు జై కేసీఆర్, జై కేటీఆర్ అంటున్నారని చెప్పారు.

టీఆర్ఎస్ లో తన ఆత్మగౌరవం దెబ్బతినడం వల్లే తాను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశానని కొండా తెలిపారు. తాను వేసుకునే దుస్తులపై కూడా కేసీఆర్ కామెంట్ చేసేవాడని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో పని చేసిన వారికి పార్టీలో ప్రాధాన్యత లేదని... కొత్తగా చేరినవారికే పెద్ద పీట వేస్తున్నారని విమర్శించారు.