హైదరాబాద్, నవంబర్ 23: కూకటపల్లి టీడిపి అభ్యర్ధి.. నందమూరి సుహాసిని తనను ప్రచారంలో దూరం పెట్టడంతో వివేకానంద నగర్ కాలని డివిజన్ కి చెందిన మాధవరం రంగారావు తెలంగాణ జాయిన్ అయ్యారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని కూకట్పల్లి డివిజన్.. ఇటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్కాలనీ డివిజన్లకు ఆయన ప్రస్తుతం ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే సుహాసిని ప్రచారం విషయంలో ఆయనను దూరంగా పెడుతున్నారని, తనకు ప్రచారంలో సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆయన అసహనంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆయన తెరాస లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. గత కార్పొరేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి తన సతీమణిని పోటిలో నిలిపారు. ఇక ఆయన దూరం కావడం టిడిపికి నష్టమా లాభమా అనేది స్పష్టత లేకపోయినా సుహాసిని ఆయన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అనేది స్పష్టత లేదు.