హైదరాబాద్, నవంబర్ 23: తెలంగాణ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బరిలోకి వస్తున్నామని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతు 2019 సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ ఎన్నికలు సన్నాహకంలాంటివని ఆయన అభిప్రాయపడ్డారు. టిడిపి తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పొత్తు వల్ల 2014లో తాము చాలా నష్టపోయామని వ్యాఖ్యానించారు. తెలంగాణకు చంద్రగ్రహణం పట్టుకుందని.. దాన్ని వదిలించేందుకు భాజపానే ప్రత్యామ్నాయం అని తెలిపారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలను పెంచి పోషిస్తున్నాయని మండిపడ్డారు.