హైదరాబాద్, నవంబర్ 23: తెలంగాణ ఎన్నికలో ఓడిపోతే ఫాంహౌస్లో విశ్రాంతి తీసుకుంటానని అన్నందుకు కెసిఆర్కు అభినందనలు తెలియజేస్తున్నానని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి వంగ్యాస్త్రాలు సంధించారు అలాగే కెటిఆర్ కూడా తెలంగాణకు గుడ్బై చెప్పి అమెరికాకు వెళ్లిపోతారని ఆయన అన్నారు.అధికారంలోకి వచ్చేది ప్రజాకూటమేనని పునరుద్ఘాటించారు. ఈ మేరకు గాంధీభవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు తెరాస నాయకులు కేసీఆర్ తీరు పట్ల విసిగెత్తిపోయి ఉన్నారని ఉత్తమ్ కుమార్ తెలిపారు . కేసీఆర్ కేవలం తన కుటుంబం కోసం, తన కుమారుడి కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. తన కుటుంబం బాగుపడడానికే తెలంగాణ ఏర్పడినట్లు భావిస్తున్నారని విమర్శించారు.