వీహెచ్ కు తప్పిన ప్రమాదం

SMTV Desk 2018-11-22 12:48:02  V. Hanumantha Rao,congress,trs

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 22: తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామం వద్ద ప్రచారం ముగించుకుని వస్తున్న కాంగ్రెస్ రథం రెండు చక్రాలు ఊడిపోయాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే మహేందర్‌ రెడ్డి తరఫున ప్రచార రోడ్‌షోలో పాల్గొన్న వి. హనుమంతరావు తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా నేరెళ్ల గ్రామ శివారు వద్ద ఈ సంఘటన జరిగింది.

డ్రైవర్‌ చాకచక్యంగా వాహనాన్ని అదుపు చేశారు. దీంతో వీహెచ్, వాహనంలోని ఇతరులు ఎలాంటి గాయాలూ కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. కాగా, బస్సు స్క్రూలను తొలగించడంతో చక్రాలు ఊడిపోయాయని, తన హత్యకు ఎవరో కుట్ర పన్నారని వీహెచ్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించే వరకు అక్కడి నుంచి కదలనని అన్నారు.