హైదరాబాద్ నవంబర్ 21: మేడ్చల్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెరాస పార్టీని వీడినా నష్టం లేదని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ అపద్ధర్మ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విశ్వేశ్వర్ రెడ్డి ప్రజల మనిషి కాదన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి పార్టీని వీడితే ఏ మాత్రం నష్టం లేదని చెప్పారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డితో తాను నాలుగేళ్లన్నర ఏళ్ల పాటు కలిసి పనిచేసినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి అంటే తనకు చాలా గౌరవం ఉందన్నారు.