నేటి నుండి 6 రోజుల వరకు కేసీఆర్ ప్రచారాలు

SMTV Desk 2018-11-19 16:44:52  Telangana elections, KCR

హైదరాబాద్, నవంబర్ 19: ఎన్నికల నామినేషన్ గడువు ముగుస్తోండగా అన్ని పార్టీ నేతలు ప్రచారంలో దూసుకేల్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో ఇవాళ మధ్యాహ్నం నుంచి ఎన్నికల ప్రచారానికి దిగనున్నారు. వొక్కోరోజు నాలుగు నుంచి ఆరు నియోజక వర్గాల్లో ప్రచారం చేస్తారు కేసీఆర్. రోడ్ షోలను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎర్రవల్లిలో కేసీఆర్ చేస్తున్న యాగాలు ఇవాళ ముగుస్తాయి. యాగం ముగిసిన అనంతరం అక్కడినుంచి ఆయన నేరుగా ఖమ్మం, జనగామ జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. ఇవాల్టి నుంచి వరుసగా 6 రోజులు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించనున్నారు కేసీఆర్. ఇందుకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఆరు రోజుల్లో 22 నియోజకవర్గాల్లో పర్యటించి ఎన్నికల సభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కేసీఆర్. మధ్యాహ్నం 2.30 గం.కు ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగే సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు.