ఒకే రోజు...ఒకే సభ...

SMTV Desk 2018-11-18 19:05:17  TRS, BJP, Chandrashekar rao, Aadithyanath

తాండూరు, నవంబర్ 18: ఈ నెల 25 న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అదే రోజు అదే ప్రదేశంలో బీజేపీ పార్టీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సభ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఈ నెల 16న కళాశాల ప్రిన్సిపాల్‌తో అనుమతి కూడా తీసుకున్నారు.

దీనికి తెరాస నేతలతో బీజేపీ నేతలు మాట్లాడుతూ మేము ఈ నెల 16 నే అనుమతి తీసుకున్నామని చెబుతుంటే అధికార పార్టీ నేతలు కూడా అదే రోజుకు అనుమతి తీసుకున్నట్టుగా చెబుతున్నారు. కాగా ఇద్దరు ముఖ్యమంత్రుల సభలను నిర్వహించడం కోసం భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో వొక పార్టీ సభను వేరే మైదానానికి మార్చే అవకాశం ఉందట.