రేవంత్ ను హెచ్చరించిన సీతారం నాయక్

SMTV Desk 2018-11-15 19:06:26  Revanth, seetaram naik ,kcr , Trs party telangana

హైదరాబాద్ , నవంబర్14: టీఆర్ఎస్ ఎంపీలు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన మాటలో వాస్తవం లేదని టీఆర్ఎస్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. టీఆర్ఎస్ శ్రేణులను ఆత్మరక్షణలో పడేసేందుకు... రేవంత్ రెడ్డి ఇలాంటి గేమ్ ఆడుతున్నాడు అని మండిపడ్డాడు .అతనికి ధైర్యం ఉంటే ఆ ఇద్దరి ఎంపీ నేతల పేర్లు చెప్పాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి నిజ స్వరూపం ఏంటో అందరికీ తెలుసని... ఇలాంటి వేషాలు ఎన్ని వేసిన ప్రజలు నమ్మరని చెప్పారు. తాను టీఆర్ఎస్ ను వీడే ప్రసక్తి లేదని... మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రేవంత్ పై కేసులు పెడతానని అన్నారు.

ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని... కేసీఆర్ కు దమ్ముంటే వారిని కాంగ్రెస్ లో చేరనీయకుండా అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సీతారాంనాయక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరనున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో, ఆ వార్తలను సీతారాంనాయక్ మీడియా ముందు వెల్లడించారు .