హైదరాబాద్, నవంబర్ 15: ప్రముఖ కాంగ్రెస్ పార్టీ లో సహించలేని అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ సీట్లు అమ్ముకోవాడానికి పార్టీ నేతలు సిద్దమవుతున్నారని టీ.కాంగ్రెస్ నేత, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తున్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ కుమారుడు సాగర్తో మాట్లాడిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో టేపును ఆయన బయటపెట్టారు.
హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మల్లేశ్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీలో వొక్కో టికెట్ ను 3నుంచి 4కోట్లకు అమ్ముకుంటున్నారు. నేను పార్టీకి చేసిన సేవ గురించి ప్రతి వొక్కరికీ తెలుసు. పోటీ చేసేందుకు నేను అర్హుడిని కాదంటే గాంధీభవన్లో లీడర్గా కాదు అటెండర్గా పనిచేస్తాను. ఈ ఆడియో టేపు గురించి రాష్ట్ర నాయకత్వానికి చెబితే ‘చూద్దాం.. మాట్లాడదాం అన్నారు . స్క్రీనింగ్ కమిటీలో భక్త చరణ్ దాస్ గారు నన్ను అడిగితే కరెక్టుగా సమాధానం చెప్పాను. భక్త చరణ్దాస్కు, ఆయన్ని సమర్ధించే ఈ దొంగనాయకులను ఎవరినైనా రమ్మనమనండి. ఇది నిజం కాకపోతే, నన్ను ఉరితీయండి. ఇలాంటి వాళ్లు పార్టీ నుంచి బయటకు వెళ్తేనే స్వచ్ఛమైన కాంగ్రెస్ బతుకుతుంది. కాంగ్రెస్ పార్టీ వీళ్లయ్య జాగీరు కాదు. ఈ కొడుకులు ఇవాళ ఉంటారు రేపు పోతారు. ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలకు వివరిస్తున్నా. రాహుల్, సోనియాలకు తెలియాలంటే పత్రికాముఖంగా వస్తేనే ఇదంతా తెలుస్తుంది అని అన్నారు.