కాంగ్రెస్ మూడో జాబితా విడుదలకు సిద్దం

SMTV Desk 2018-11-15 12:04:07  Telangana elections, Congress

హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణాలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే 75 మంది అభ్యర్డులతో కూడిన రెండు జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన 19 మంది అభ్యర్దుల పేర్లను రేపు విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియా తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ మొత్తం 94 స్థానాలలో పోటీ చేయబోతుండగా, మహాకూటమి భాగస్వాములుగా ఉన్న టిడిపి-14, టిజేఎస్-8, సిపిఐ-3 స్థానాలలో పోటీ చేయబోతున్నాయి. కానీ టిజేఎస్ 12 స్థానాల నుంచి పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత విశ్వేశ్వర్ రావు నిన్న సాయంత్రమే ప్రకటించారు. కనుక కాంగ్రెస్‌-టిజేఎస్ మద్య ఇంకా మరో నాలుగు సీట్లపై చర్చలు జరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది.

ఆ నాలుగు సీట్లను కాంగ్రెస్‌, టిజేఎస్ పార్టీలు పంచుకొంటాయా లేక స్నేహపూర్వక పోటీకి దిగుతాయో చూడాలి. ముఖ్యంగా జనగామ సీటును కాంగ్రెస్ పార్టీ పొన్నాల లక్ష్మయ్య కోసం తీసుకొంటుందో లేక టిజేఎస్ పార్టీకి విడిచిపెడుతుందో చూడాలి.