హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం సీఈవో రజత్ కుమార్ మాట్లాడుతూ నామినేషన్ల సమయం ఉ :11 గంటల నుండి మధ్యహ్నం 3 గంటల వరకు నిర్వహిస్తామని వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉ.7 గంటల నుండి సా. గంటల వరకే పోలింగ్ జరిగేల సన్నాహాలు చేశాం. అలాగే జాతీయ పార్టీ ప్రాంతాల్లో 40 మంది స్టార్ క్యాంపెనర్స్, ప్రాంతీయ పార్టీ ప్రాంతాల్లో 20 మంది క్యాంపెనర్స్ ని ఉంచుతాం. కాగా ఈ రోజు నుండి పోటీ చేస్తున్న అభ్యర్ధుల ఖర్చు వివరాలను కూడా పొందుపరుస్తాం అని చెప్పారు. ఇప్పటివరకు రూ.77.62 కోట్ల నగదును సీజ్ చేశాం. అలాగే 47,234 కేసులు నమోదయ్యాయి. ఇంకా 4,038 నకిలీ మద్యం దుఖానాలు తొలగించాం అంటూ పేర్కొన్నారు.