యాదాద్రి, అక్టోబర్ 30: భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ నేత బూడిద భిక్షమయ్యగౌడ్ అనుచరులు, తెలంగాణ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుపై దాడికి దిగారు. రాబోతున్న ఎన్నికలకై ఆలేరు నుంచి పోటీ చేసేందుకు మోత్కుపల్లి అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) పార్టీ టికెట్పై మోత్కుపల్లి పోటీ చేయడం ఖరారైపోయింది.
ఈ సందర్భంలో ఆయన యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ప్రచారంలో పాల్గొన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన భిక్షమయ్య గౌడ్ అనుచరులు మోత్కుపల్లి అనుచరులపై దాడికి పాల్పడ్డారు. దీంతో తమపై దాడిచేసిన భిక్షమయ్య గౌడ్, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలంటూ మోత్కుపల్లి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. 2009లో ఆలేరు నియోజకవర్గం నుంచి భిక్షమయ్యగౌడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.