న్యూఢిల్లీ, అక్టోబర్ 29: తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఢిల్లీ చేరుకున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఇవ్వాళ తిరిగి హైదరాబాద్ కు బయల్దేరుతున్నారని సమాచారం అందింది. అక్కడికి కేవలం కంటి, పంటి వైద్య పరీక్షల కోసం వెళ్లారని తెలియజేసారు.
అలాగే నిజాముద్దీన్లోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు దంత పరీక్షలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉండనున్న నేపథ్యంలో.. వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవడానికి ఆయన ఢిల్లీ వెళ్లినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది.