హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఊపందుకొన్న తరుణంలో ఆదివారం డిల్లీ వెళ్లారు. అయితే ఈ పర్యటనలో ఆయన డిల్లీలో ఎవరినీ కలవరని సమాచారం. వైద్యుల సలహా మేరకు కళ్ళు, పళ్ళు పరీక్షలు చేయించుకొని అవసరమైన చికిత్స తీసుకొనేందుకే ఆయన డిల్లీ వెళ్ళినట్లు సమాచారం. ఇదివరకు ఆయన డిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకొన్నందున మళ్ళీ అక్కడే చికిత్స చేయించుకోబోతున్నారు.
నవంబర్ మొదటి వారం నుంచి డిసెంబర్ 5వరకు సిఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు కనుక మద్యలో ఇబ్బందిపడకుండా ఉండేందుకు ముందుగానే వైద్యపరీక్షలు చేయించుకొని అవసరమైన చికిత్స చేయించుకొంటే మంచిదని భావించి డిల్లీ వెళ్లారు. సిఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం డిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకొంటారు.