కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో టీఆర్‌ఎస్‌ నేత

SMTV Desk 2018-10-27 16:43:19  mlc, ramul naik, trs, congress

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: తెరాస పార్టీ నుండి వోక్కక్కరుగా అందారూ జారుకుంటున్నట్లు కనపడుతోంది. మొన్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి టీఆర్‌ఎస్‌కు గుడ్ బే చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. నేడు ఎమ్మెల్సీ రాముల్ నాయక్ అదే పద్దతి అనుసరించాడు. రాముల్ నాయక్ ఆత్మగౌరవం కోసమే కాంగ్రెస్ లో చేరానని వెల్లడించారు.

పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు.ఈ క్రమంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. ఆ పార్టీలో అధిష్టానం చెప్పిందే వేదమన్నారు. టీఆర్ఎప్ ప్రైవేట్ లిమిటెడ్ గా మారిందని విమర్శించారు. తెలంగాణ ద్రోహులను కేబినెట్ లోకి తీసుకున్నారని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్లు అడిగితే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.