హైదరాబాద్, అక్టోబర్ 24: నిరుద్యోగులకు తీపి కబురు. ఈ నెల 26,27 తెదీల్లొ నగరం లోని నాంపల్లి దగ్గర్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బి2బి ఇన్ఫర్మేసన్ పోర్టల్ ట్రేడ్ మహా ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళాలో 12౦ కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని ట్రేడ్ హైదరాబాద్ సీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు.ఇంధన, సౌర, మొబైల్, హాస్పిటాలిటీ, సివిల్, మెకానికల్, కన్స్ట్రక్షన్, జువెలరీ, ఆరోగ్య సేవలు, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ కంపెనీలు ఈ మేళాలో దాదాపు 35 వేల ఖాళీలకు ఇంటర్వూలు నిర్వహించనున్నాయని ఆయన చెప్పారు.