మిర్యాలగూడ, అక్టోబర్ 24: టీఆర్ఎస్ సీనియర్ నేత అల్గుబెల్లి అమరేందర్రెడ్డి ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని, 10 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తూ, ఎన్నో అవమానాలు భరించినా ఇప్పుడు అతన్ని పిలిచి మాట్లాడే దిక్కే లేదు అంటూ ఆరోపించారు. అలాగే పోలిటిక్స్ ఇన్ని ట్రిక్స్ ఉంటాయ అని అనిపిస్తుందన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల సాధనే లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీకి విధివిధానాలు లేవన్నారు. ఉద్యమ సమయంలో రాత్రి, పగలు కష్టపడి కేసీఆర్తో కలిసి తెలంగాణ సాధించామన్నారు. అయితే తనకు పార్టీ న్యాయం చేయలేదని, కార్యకర్తల పరిస్థితి అదేవిధంగా ఉందని, పార్టీలో అన్యాయం, దోపిడీ జరుగుతుందని వాపోయారు. తన వెన్నంటి ఉన్న నాయకులు, కార్యకర్తలందరికీ విషయం తెలియజేసిన అనంతరమే పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నానన్నారు.
అనంతరం అమరేందర్రెడ్డి ఈ క్షణమే టీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.కాగా గాయం ఉపేందర్రెడ్డి, దుర్గాప్రసాద్, దయాకర్రెడ్డి ఈ సమావేశం లో పాల్గొన్నారు.