తీవ్ర అసంతృప్తిలో కోదండరామ్ .... !!

SMTV Desk 2018-10-10 11:17:51  Telangana Congress, kodanda Ram, Mahakutami, Telangana Elections

తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో ఏర్పాటైన తెపవే (తెలంగాణ పరిరక్షణ వేదిక)లో తమ పార్టీకు కేటాయించే సీట్లపై తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి 48 గంటల డెడ్ లైన్ విధించినట్టు తెలుస్తోంది. మహాకూటమిగా ఏర్పడిన తరువాత, కూటమిలోని పార్టీలకు ఇచ్చే సీట్లపై కాంగ్రెస్ తేల్చడం లేదని ఆరోపించిన ఆయన, తమకు కేటాయించే సీట్ల విషయంలో గురువారం రాత్రికి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.


కాంగ్రెస్ అప్పటికి తేల్చకపోతే 21 మందితో తన తొలి జాబితాను విడుదల చేస్తామని ఆయన హెచ్చరించారు. పొత్తుల విషయంలో కాంగ్రెస్ ధోరణి సంతృప్తికరంగా లేదని వ్యాఖ్యానించిన ఆయన, 25 మందితో తమ రెండో జాబితా కూడా సిద్ధం అవుతోందని అన్నారు. తాము 19 సీట్లలో పోటీ చేయాలని తొలుత భావించామని, ఈ స్థానాల విషయాన్ని కాంగ్రెస్ కు చెప్పామని ఆయన అన్నారు.