హైదరాబాద్. ముందుస్తు ఎన్నికలకు వెళ్లనున్న కేసీఆర్ ఇప్పటికే 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కేకే అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీ కూడా వేసినట్టు ఈ సందర్బంగా మీడియా సమావేశంలో వివరించారు. ఈ కమిటీలో సభ్యులుగా జితేందర్రెడ్డి, జి.నగేష్, ఈటల రాజేందర్, హరీష్రావు, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, చందూలాల్, పద్మారావుగౌడ్, కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఫరీదుద్దీన్, పి.రాములు, గుండు సుధారాణిని నియమించారు.