* సర్వశిక్షా అభియాన్ ఒప్పంద పొరుగు సేవల సిబ్బంది *తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్రగతిభవన్ ఎదుట ఆందోళన హైదరాబాద్ :తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయనుకున్నాం. మాతో రోజు వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఇకనైనా మా సమస్యలు పరిష్కరించండటూ సర్వశిక్షా అభియాన్ ఒప్పంద పొరుగు సేవల సిబ్బంది హైదరాబాద్ లోని ప్రగతి భవన్ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో ప్రగతిభవన్ సిబ్బందిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే, వీరి ఆందోళన కారణంగా బేగంపేటలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలించారు. తెలంగాణ వస్తే కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇపుడు దాటవేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేసారు.